అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ప్రతినిధుల సభలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్పై
అమెరికా సైనిక చర్యలను నిలిపివేయాలంటూ తీసుకొచ్చిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 215 మంది సభ్యులు ఓటు వేయగా, 208 మంది వ్యతిరేకించారు. అనవసరంగా భారీ ఖర్చులకు దారితీసే యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ పరిణామంతో ట్రంప్ విదేశాంగ విధానానికి కీలక సవాల్గా మారింది.