అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్పై దూకుడు ప్రదర్శిస్తూ, మరిన్ని యుద్ధనౌకలు ఆ దేశం వైపు వెళ్తున్నాయని హెచ్చరించారు. ఇప్పటికే USS అబ్రహం లింకన్ పశ్చిమాసియాకు చేరుకుంది. ఇరాన్ ఒప్పందం చేసుకుంటుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా తరలిస్తున్నారు. ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, అమాయకుల ప్రాణనష్టంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరాన్పై అమెరికా ఏ క్షణమైనా దాడులు చేయవచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి.