భారత్, చైనా రష్యాకు నిధులు అందిస్తున్నాయి: ట్రంప్

15894చూసినవారు
భారత్, చైనా రష్యాకు నిధులు అందిస్తున్నాయి: ట్రంప్
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారత్, చైనాలు నిధులు అందిస్తున్నాయని ఆరోపించారు. రష్యన్ చమురు కొనుగోలు ద్వారా ఈ రెండు దేశాలు రష్యాకు సహకరిస్తున్నాయని, యుద్ధానికి ప్రాథమిక నిధుల్ని సమకూరుస్తున్నాయని మండిపడ్డారు. యూరప్, నాటో మిత్రదేశాలు రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లను నిలిపేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. యుద్ధాన్ని ముగించడంలో రష్యా ఒప్పందానికి రాకపోతే, అమెరికా శక్తివంతమైన సుంకాలను విధించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్