యూపీలోని బిజ్నోర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నహ్తౌర్ ప్రాంతంలోని చక్ గోవర్ధన్ గ్రామంలో ఆదివారం షంషాద్ అహ్మద్ కుమారుడు సైఫ్ (రెండున్నరేళ్లు) ఇంట్లో మిఠాయి తింటుండగా, అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడకపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. కుటుంబ సభ్యులు అతన్ని నహ్తౌర్ సిహెచ్సికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మిఠాయి శ్వాసనాళంలో ఇరుక్కుపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు.