TG: రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ బ్రిడ్జ్పై జరిగింది. ఈ ప్రమాదంలో కర్నూలుకు చెందిన శేషయ్య, నవనీత ప్రాణాలు కోల్పోయారు. కారులో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.