షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'కాక్టెయిల్ 2' సినిమాలో ఈ ఇద్దరు హీరోయిన్లు స్వలింగ సంపర్కులుగా నటిస్తున్నారని SMలో ప్రచారం జరిగింది. అయితే ఇవాళ జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దీనిపై కృతి స్పందించారు. సెట్లో మేమిద్దరం వెంటనే కలిసిపోయామని రష్మిక చెప్పింది. అందుకే లెస్బియన్స్ అంటూ రూమర్స్ వచ్చాయా అని హీరో షాహిద్ ప్రశ్నించారు. దీనికి ‘ఇద్దరు మగవాళ్లు కలిస్తే బ్రోమాన్స్ అంటారు. అదే ఇద్దరు అమ్మాయిలు కలిస్తే వీరి మధ్య ఏదో ఉందంటారు. ఇది బాధాకరం’ అని కృతి బదులిచ్చారు.