తెలంగాణ రాష్ట్రంలో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా రేణికుంట వద్ద ఉదయం 5గం.కు మెట్పల్లి డిపో ఆర్టీసీ బస్సు వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అలాగే నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్ ను ఢీకొట్టగా, అందులోని నలుగురికి గాయాలయ్యాయి. ఈ రెండు సంఘటనలు తెల్లవారుజామున జరిగాయి.