TG: నిజామాబాద్ జిల్లా దేవక్కపేటలో భర్త మోహన్ను అతని భార్యలు కవిత, సంగీత కలిసి అతి కిరాతకంగా చిత్రహింసలకు గురిచేసి చంపారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. రోజూ గొడవలతో విసిగిపోయిన భార్యలిద్దరూ ఏకమై భర్త ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలైన మోహన్ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.