
రోడ్ల మరమ్మతులకు రూ.1000 కోట్ల నిధులు మంజూరు
ఆంధ్రప్రదేశ్లో రహదారుల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. మొత్తం 274 రోడ్ల మరమ్మతుల కోసం రూ.1000 కోట్లు మంజూరు చేసింది. ఇందులో స్టేట్ హైవేలపై 108 పనులకు రూ.400 కోట్లు, జిల్లా రోడ్లలో 166 పనులకు రూ.600 కోట్లు కేటాయించారు. ఈ మేరకు పాలనాపరమైన అనుమతులు జారీ చేసినట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు తెలిపారు.




