ఉత్తరాఖండ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జనావాసాల్లో ఎలుగుబంట్లు సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా శ్యాంపూర్ గాంధీ ప్రాంతంలోని రిషికేశ్ రోడ్డులో ఓ ఎలుగుబంటి ఇద్దరు యువకుల వెంటపడింది. అయితే సదరు యువకులు గల్లీలో నడుచుకుంటూ వెళ్తుండగా ఎలుగుబంటి ఎదురుపడింది. దీంతో వారు వెనక్కి తిరిగి పరుగెడుతుండగా అది వెంబడించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.