ఆస్ట్రియాలో రీల్స్ తీసేందుకు రైలు ఎక్కిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. వంతెనను గమనించకుండా రైలు పైన వీడియో షూట్ చేస్తున్న సమయంలో.. రైలు వంతెనకు తగిలి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువకుడి తల తెగిపడగా, మరొకరు తీవ్రంగా గాయపడి మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.