AP: కృష్ణా జిల్లా కుమ్మరిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ఈదురుగాలులకు తాటిచెట్లు విరిగిపడటంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు గరికిపాటి మనోహర్ (30) సీహెచ్.శివరామకృష్ణ (28)గా గుర్తించారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.