తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కరకాలం గడిచినా, ఇప్పుడు ముష్కరుల చేతిలోకి పోయిందని బీఆర్ఎస్ నాయకులు
కేటీఆర్ ఆరోపించారు. మోడీ, రేవంత్ రెడ్డిలు రైతులకు యూరియా పంపిణీ చేయరని, ఓట్లప్పుడు తప్ప నాట్లప్పుడు రైతుబంధు వేసే ముఖం లేదని విమర్శించారు. రైతు డిస్కం పేరుతో కొత్త దుకాణం తెరిచి, ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లకు మీటర్లు పెడతారని
కేటీఆర్ ఆరోపించారు.