ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. ఇటీవలి ఇండిగో సంక్షోభం, విమాన షెడ్యూల్లు, ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులపై ఇండిగో సీఈఓతో రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 శాతం విమాన సర్వీసులను తగ్గించాలని ఇండిగోకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.