మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దాడులతో ఇరాన్లో మరణించిన వారి సంఖ్య 787కు చేరిందని ఇరాన్ స్టేట్ మీడియా తెలిపింది. అయితే ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగుతూ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయిల్పై దాడులు చేస్తోంది. గల్ఫ్ ప్రాంత దేశాలపై విరుచుకుపడుతోంది. కాగా, ఈ మొత్తం పరిస్థితిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.