అమెరికా ఇరాన్ చమురు కొనుగోలు, మార్కెటింగ్లో నిమగ్నమైన 50కి పైగా సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించింది. అయితే ఈ జాబితాలో భారతీయులు వరుణ్ పులా, సోనియా శ్రేష్ఠ, అయ్యప్పన్ రాజా పేర్లు ఉన్నట్టు ట్రెజరీ వెల్లడించింది. వీరు ఇరాన్ చమురు, ఎల్పీజీ ఉత్పత్తులను తరలించడంలో ప్రత్యక్ష లేదా పరోక్షంగా పాల్గొన్నారని పేర్కొంది. ఇరాన్కి నగదు ప్రవాహాన్ని అడ్డుకొని ఉగ్రవాద గ్రూపులకు నిధులు చేరకుండా చేయడమే లక్ష్యమని ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు.