అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు ఇరాన్లోని బందర్ అబ్బాస్ నావికా స్థావరంపై ఉపరితల డ్రోన్లను (సీ డ్రోన్లు) ఉపయోగించి దాడి చేశాయి. ఈ దాడుల్లో ఒక జలాంతర్గామితో పాటు నౌకా నిర్వహణ కేంద్రం లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను యూఎస్ సెంట్రల్ కమాండ్ ‘ఎక్స్’లో పోస్టు చేసింది. యుద్ధ కార్యకలాపాల్లో
అమెరికా దళాలు సీ డ్రోన్లను ఉపయోగించడం ఇదే మొదటిసారని, దీనివల్ల ఇరాన్ సామర్థ్యం దెబ్బతిందని పేర్కొంది.