ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోయింది. దాంతో వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించేందుకు టెలికం కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో మొబైల్ రీఛార్జ్ ధరలను సైతం పెంచాయి. గతంతో పోల్చితే కనీస రీఛార్జ్ ధరలు భారీగా పెరిగాయని యూజర్లు వాపోతున్నారు. గతంలో రూ.10 రీఛార్జ్ చేసి కాల్స్ మాట్లాడుకునేవాళ్లమని, ఇప్పుడు రూ.199 రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోందని మండిపడుతున్నారు. టెలికం కంపెనీల దోపిడీని అరికట్టాలని కోరుతున్నారు.