తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మంత్రి ఉత్తమ్కుమార్ ఈరోజు రాత్రి కేరళకు బయలుదేరనున్నారు. రేపు ఆయన తమిళనాడులోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ పర్యటన ద్వారా రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించనున్నారు.