ఉత్తరప్రదేశ్లోని అన్ని విద్యాసంస్థల్లో వందేమాతరం గీతాలాపనను తప్పనిసరి చేస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ప్రతి రోజు వందేమాతరం పాడాలని ఆదేశాలు జారీ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు దేశ ఏకత, అఖండత కోసం కృషి చేయాలని యోగి సూచించారు. దేశభక్తి, జాతీయ ఏకతను బలపరచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.