నటుడు వరుణ్ సందేశ్ అయ్యప్ప దీక్షలో ఉండగా, ఆయన నివాసంలోని ఆలయంలో పడి పూజ నిర్వహించారు. ఈ పూజలో దాదాపు 350 మంది అయ్యప్ప స్వాములు పాల్గొన్నారని వరుణ్ సతీమణి వితికా షేరు తెలిపారు. 2023లో ఏర్పాటు చేసిన ఆలయంలోనే ఈ పూజ జరిగిందని, అలంకరణ, పూజను తామే స్వయంగా చేశామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ఆమె తన యూట్యూబ్ ఛానల్లో అభిమానులతో పంచుకున్నారు.