ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. పార్లమెంట్ భవనంలోని 101 వసుధ హాల్లో పోలింగ్ జరుగుతోంది. ప్రధాని మోదీ తొలి ఓటు వేశారు. మొత్తం 770 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, NDA తరపున రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో TDP, YCPలు NDA అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాయి. కాంగ్రెస్ ఇండియా కూటమి అభ్యర్థి వైపు ఉండగా BRS, బిజద ఎన్నికకు దూరంగా ఉన్నాయి.