సినీ హీరో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి మంగళవారం వేకువజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అర్చన సేవలో పాల్గొన్న ఆమెకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.