TG: కొమురం భీం జిల్లాలోని సిర్పూర్ టి మండలం వేంపల్లి రైల్వే బ్రిడ్జ్ వద్ద చిరుత పులి సంచారం కలకలం రేపింది. వాహనదారులు ఈ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఈ సంఘటన స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.