TG: నిజామాబాద్ జిల్లా సిరిపూర్లో రాత్రిపూట చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామంలోకి ప్రవేశించిన చిరుత, పశువులను తినేందుకు వచ్చి, కుక్కల అరుపులకు భయపడి పారిపోయింది. సీసీటీవీ ఫుటేజ్లో చిరుత కనిపించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.