యూపీలోని బిజ్నోర్లో విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ రాజ్కుమార్ (40) ప్రభుత్వ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మీడియా కథనాల ప్రకారం.. అతనికి వేరే మహిళతో సంబంధం ఉందని అతని భార్య అంచల్ అనుమానించింది. దీంతో భార్యాభర్తల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రాజ్కుమార్ బుధవారం ఉదయం తన అధికారిక నివాసంలో లైసెన్స్ గల తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.