టీవీకే అధినేత, నటుడు విజయ్ గురువారం ఈరోడ్ జిల్లాలోని విజయమంగళం టోల్ గేట్ దగ్గర ప్రజలను ఉద్దేశించి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత రాష్ట్రంలో ఆయన చేపడుతున్న తొలి భారీ ర్యాలీ ఇదే. వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ్ తన ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి టీవీకే నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.