తమిళనాడు సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ప్రజల్లోకి రానున్నారు. రేపు సాయంత్రం తిరుచ్చి తూర్పు నియోజకవర్గంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఎన్నికల్లో తనను గెలిపించిన ప్రజలకు విజయ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలపనున్నారు. ఈ సభకు భారీగా జనసమూహం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ పర్యటించి ప్రజలకు ధన్యవాదాలు తెలపనున్నారు.