ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, భారతిరెడ్డిలకు చెందిన క్లాసిక్ రియాల్టీ వాటాలను వైఎస్ విజయమ్మ, చాగరి జనార్దన్రెడ్డిల పేరుతో బదలాయించడంపై చెన్నైలోని జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. వాటాల బదలాయింపు తర్వాత వైఎస్ విజయమ్మకు 99.75% వాటాను కొనసాగించాలని ఆదేశించింది. అయితే, వాటాల బదలాయింపు లాంటి చర్యలకు పాల్పడరాదని ఇరుపక్షాలను ఆదేశించింది.