దక్షిణ మధ్య రైల్వే విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించనుంది. డిసెంబర్ 10న ఈ రైలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విజయవాడ నుండి ఉదయం 5.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.15 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా జనవరిలో పట్టాలు ఎక్కనున్నాయి. నవంబర్ 26 నుండి సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు సామర్థ్యాన్ని 18 AC చైర్ కార్లు, 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్లకు పెంచుతున్నారు.