సరిహద్దుల్లో సైనికుల వలే తెలంగాణలో పోలీసులు శాంతిభద్రతలు కాపాడుతున్నారని CM రేవంత్ వ్యాఖ్యానించారు. విధి నిర్వహణలో మరణించిన IPSల కుటుంబాలకు రూ. 2 కోట్లు అందిస్తున్నట్లు తెలిపారు. అదనపు SP, DSP స్థాయి అధికారులకు రూ.కోటిన్నర ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసుల పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రియల్ హీరోస్ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు.