రాజేంద్రనగర్లో భూ వివాదం పోలీసుల వరకు చేరింది. సన్ సిటీ సమీపంలోని ఒక ప్రైవేట్ స్థలంలో నిర్మించిన ప్రహరి గోడను దుండగులు జేసీబీతో కూల్చివేశారు. సుమారు 100 మంది వ్యక్తులు దౌర్జన్యంగా స్థలంలోకి ప్రవేశించి హంగామా సృష్టించారు. స్థల యజమాని కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది.