కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ ప్రశాంత్, శ్రీరాముడి పాలన ప్రపంచానికే ఆదర్శమని, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అలాంటి పాలన అందిస్తున్నారని శ్రీరామ నవమి ఉత్సవాల్లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సంక్షేమ, అభివృద్ధిలో దేశానికి ఆదర్శమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ శంకర్ నాయక్, మురహరి వశిష్ట, ఆనంద్ లాహోటి, పూరి శేఖర్, బాలరాజు, రవి, శ్రీకాంత్ పాల్గొన్నారు.