తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డిని గండీడ్ మండల నేతలు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆశన్న, కాంగ్రెస్ పార్టీ మండల ప్రజా గాయకుడు గుముడాల చెన్నయ్య, కాంగ్రెస్ పార్టీ సభ్యులు కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.