తెలంగాణా ఉద్యమ కారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతిని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ సుదీర్ మాట్లాడుతూ. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై తన ఆస్తులన్నీ దానం చేసిన త్యాగశీలి అని, ఆయన సేవలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు.