మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఎండీ ఆజాం అలీకి ఎస్ఐగా ప్రమోషన్ వచ్చి నాగర్ కర్నూల్ కు బదిలీ అయ్యారు. దీంతో గురువారం మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై వెళ్తున్న సందర్భంగా మహమ్మదాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది ఎండీ ఆజాం అలీని ఘనంగా సన్మానించారు.