రేషన్ డీలర్లు ఆలస్యం చేయకుండా మిల్లుల నుంచి బియ్యాన్ని త్వరగా పంపించేలా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. కలెక్టరేట్లో రైస్ మిల్లర్లతో వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైస్ మిల్లులలో తయారు చేసిన రేషన్ బియ్యాన్ని సమయానికి పంపిణీ కేంద్రాలకు తరలించాలని తెలిపారు.