వికారాబాద్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. ఎన్నికల వేళ సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచామని, దాని దుర్వినియోగం చేయొద్దని హెచ్చరించారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని ఆమె అన్నారు.