మహబూబ్ నగర్ నుంచి చించోలి వరకు NH-167 రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండటంతో పైపు షిఫ్టింగ్లో భాగంగా పరిగి నియోజకవర్గం పరిధిలోని గండీడ్ మండల కేంద్రంలో విశ్వ భారతి కాలేజీ ఎదురుగా ఉన్న 300 MMDI పైప్ లైన్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. నేడు, రేపు 33 గ్రామాలకు భగీరథ నీటి సరఫరా అంతరాయం కలుగుతుందని మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చలమారెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.