టాంజానియాలో ఎన్నికలు రక్తపాతానికి దారితీసింది. అధ్యక్షురాలు సామియా సులుహు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రజలు వీధుల్లో నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలను అడ్డుకునేందుకు భద్రతా బలగాలు ప్రయత్నించడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. వాణిజ్య రాజధాని దార్ ఎస్ సలామ్లో పరిస్థితి మరింత భయానకంగా ఉంది. ప్రతిపక్ష పార్టీ ఛాదెమ తెలిపిన వివరాల ప్రకారం.. గత 3 రోజులుగా జరుగుతున్న అల్లర్లలో 700 మందికి పైగా మరణించినట్లు ప్రకటించింది.