మణిపూర్లోని విష్ణుపూర్ లో మళ్లీ హింస చెలరేగింది. అసోం రైఫిల్స్ కాన్వాయ్ పై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరికొందరు అధికారులు గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనను మణిపుర్ గవర్నర్ అజయ్ భల్లా తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో అమరులైన సిబ్బంది కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.