గుజరాత్కు చెందిన అభిమాని అంకిత్ పటేల్ టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. సూరత్ జిల్లాలోని కుద్సాద్ గ్రామానికి చెందిన అతను తన మొబైల్ కవర్పై బంగారంతో కోహ్లీ ఫొటో, పేరును చెక్కించుకున్నాడు. అంతేకాదు, బ్రాస్లెట్పైన కూడా "విరాట్" అనే పేరును వేయించుకున్నాడు. ఈ క్రమంలో అతడు సుమారు రూ.15 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ కవర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.