వనపర్తి జిల్లాలో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో ప్రజలు వినతి పత్రాలు ఎన్నో ఇస్తున్నా అధికారులు మాత్రం ప్రజా సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సక్రమంగా పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు.