వనపర్తి జిల్లా కేంద్రంలోని లక్ష్మీనరసింహ కాలనీలో మనెమోని కృష్ణయ్య ఇంట్లోకి చొరబడిన దొంగలు 43 ఇంచుల స్మార్ట్ టీవీ, రెండు గల్లా డబ్బాలను సుమారు రూ.40 వేల విలువైన సొత్తును అపహరించారు. బాధితుడు సోమవారం వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, రూరల్ ఎస్సై హృషికేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.