పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ ద్వారా సూచనలు పంపింది. త్వరలో భారత్లోనూ హింసాత్మక పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే, ఇరాన్కి అనుకూలంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న రాడికల్ ప్రచారకులను గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది.