యుద్ధం ప్రభావంతో నిత్యావసరాల ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. హర్మూజ్ జలసంధి మూసివేతతో ఇంధనం దొరకడం లేదు. దాంతో మలేషియా, ఇండోనేషియాలో పామాయిల్ ఉత్పత్తి తగ్గింది. మన దేశంలో వంట నూనెల్లో 40 శాతం పామాయిల్ వాడుతారు. దాంతో ఆహారం, చిప్స్, బేకరీ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్ల ధరలు పెరగనున్నాయి. అలాగే పామాయిల్తో చేసే సబ్బులు, కాస్మొటిక్స్, ఇతర ఉత్పత్తుల ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి.