ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. దీనితో
అమెరికా సహా అనేక దేశాల్లోని కుటుంబాలు ఇంధన బిల్లులు చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపు, ప్రపంచంలోని అతిపెద్ద చమురు కంపెనీలు ఈ యుద్ధం ద్వారా భారీగా లాభపడుతున్నాయి. ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం, ఈ ఏడాదిలో ఆరు అతిపెద్ద ఇంధన కంపెనీలు ప్రతి సెకనుకు సుమారు రూ. 2.80 లక్షల లాభాలను ఆర్జించే అవకాశం ఉంది.