భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలని సూచించారు. తొండలు జోకొడతా, ఉరితీయాలనే మాటలు సీఎంగా సబబు కాదని, ఎంతో అనుభవం ఉన్న కేసీఆర్ పట్ల ఇలాంటి భాష మాట్లాడితే చరిత్ర హీనుడిగా మిగిలిపోతావని ఆయన అన్నారు.