డోర్నకల్: ఢిల్లీ కోటపై కాషాయం.. గొల్లచెర్లలో సంబరం

78చూసినవారు
డోర్నకల్: ఢిల్లీ కోటపై కాషాయం.. గొల్లచెర్లలో సంబరం
రాబోయే ఎన్నికల్లో భారత జనతా పార్టీదే అధికారమని బిజెపి యువ నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు కొడవండ్ల వెంకన్న అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగరవేయడంతో శనివారం డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామంలో సంబురాలు చేసుకున్నారు. ఢిల్లీలో బీజేపీ గెలుపొందడంతో ప్రజలకు యువ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లను పంచారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you