మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం శివారు మూలమలుపు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేటలో ఓ వివాహ కార్యక్రమానికి క్యాటరింగ్ పనులకు వెళ్లేందుకు కురవి మండలం నుండి బొలెరో వాహనంలో వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలవగా, సందీప్ (21) అనే యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు.